4 July, 2026 | 9:58 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

12-03-2026 11:43 AM

రోడ్డు ప్రమాద బాధితులకు స్వయంగా సహాయం

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పరమావధిగా మంత్రి వాకిటి శ్రీహరి  ఉదారతను చాటుకున్నారు. గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన ఘోర బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి, ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. రక్తపు మడుగులో, భీతావహంగా ఉన్న మృతదేహాలను చూసి వెనకడుగు వేయకుండా, తన సిబ్బందితో కలిసి మంత్రి స్వయంగా వాటిని పక్కకు తొలగించారు.

వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ​అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ కంటే ప్రాణానికే విలువిచ్చిన మంత్రి తీరుపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రజా ప్రతినిధి అంటే కేవలం హోదా మాత్రమే కాదు, బాధ్యత కూడా" అని ఆయన నిరూపించారని పలువురు కొనియాడారు.