30 May, 2026 | 3:18 PM

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం

30-05-2026 02:10 PM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 

సుల్తానాబాద్ మే 29 (విజయ క్రాంతి): రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో ఐటీరంగం దూసుకు వెళ్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను విజయ రమణారావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి ఘనంగా నిర్వహించారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యులుగా 2 సార్లు మంత్రి గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారని కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మాత్యులుగా ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చేస్తున్న సేవలు అమోఘం అని అన్నారు.

పెద్దపెద్ద ఐటి కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి రప్పిస్తూ ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో శ్రీధర్ బాబు  కృషిని ఎవరు కాదన లేరన్నారు. శ్రీధర్ బాబు  ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్,  మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. దామోదర్ రావు, డిసిసి కార్యదర్శి మోబిన్, సాయిరి మహేందర్, పన్నాల రాములు, డి. శ్రీనివాసరావు, పల్లా సురేష్, అమిరిశెట్టి తిరుపతి,  సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.