15 March, 2026 | 10:53 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు

15-03-2026 05:10 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో సిబ్బంది, గ్రామపంచాయతీ కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు.

భిక్కనూర్, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, ఇసనపల్లి గ్రామాల్లో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు దివ్య, ఆరోగ్య కార్యకర్తలు శ్యామల, మంజుల, మాధవి, రాజమణి, స్వరూప, హేమలత, యశోద, ఎంఎల్హెచ్‌పీ ప్రశాంత్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.