పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం
15-03-2026 05:07 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందిని వారి సేవలను ప్రశంసిస్తూ ఆదివారం సన్మానించారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్యం నిర్వహణలో వారు చేస్తున్న కృషిని గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
గ్రామాభివృద్ధి పనుల్లో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పాత లక్ష్మీ, ఉప సర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు ఈర స్వామి,శ్రీనివాస్,మాధవ రెడ్డి,నట్ట లింగం,రాకేష్, వార్డుసభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.




