11 July, 2026 | 7:15 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా మంజుల ధర్మ, వైస్‌చైర్మన్‌గా పైపాడు సారంద

17-02-2026 12:12 AM

అలంపూర్, ఫిబ్రవరి 16: వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది.మొత్తం 10 వార్డులలో ఏకంగా ఎనిమిది వార్డుల్లో ఫార్వర్డ్ బ్లా క్ కౌన్సిలర్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీంతో చైర్మన్ ఈ దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా ద క్కించుకుంది. ముందుగా కౌన్సిలర్లంతా 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఏఐఎఫ్ బి తరపున నాలుగవ వార్డులో  గెలిచిన  మంజుల ధర్మ చైర్మన్ గా, అదే పార్టీ తరపున రెండవ వార్డులో గెలిచిన పైపాడు సారందను మిగతా కౌన్సిలర్లంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమీషనర్ రాజయ్య చైర్మన్ గా మంజుల ధర్మ, వైస్ ఛైర్మన్ గా పైపాడు సారంద చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం చై ర్మన్ మంజుల ధర్మ మాట్లాడుతూ.. ఏఐ ఎ ఫ్ బి ముఖ్య నేత సీనియర్ నాయకులు వడ్డేపల్లి శీనన్న నేతృత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. వడ్డేపల్లి పట్టణమంతా సింహం జెండాలను చేత పట్టి  బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున నాయకులు సంబరాలు చేసుకున్నారు.