మర్యాద ఇవ్వడం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ
అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో దారుణం చోటుచేసుకుంది. నిన్న పాఠశాల నుంచి ఇంటికి వస్తుండుగా ఏడేళ్ల చిన్నారి వేమ్ చంద్రకు మాయమాటలు చెప్పి బావ బోయ సర్వేశ్ తీసుకెళ్లాడు. వేమ్ చంద్రను హత్య చేసి కుందనకోటకొండలో పడేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడిని బోయ సర్వేశ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి వేమ్ చంద్ర అక్కను బోయ సర్వేశ్ వివాహం చేసుకున్నాడు. ఉగాదికి భార్యతో కలిసి బోయ సర్వేశ్ అత్తవారింటికి వెళ్లాడు. తనకు గౌరవం ఇవ్వడంలేదని అత్త, మామాలపై బోయ సర్వేశ్ కక్ష పెంచుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా తినుబండారాలు ఇప్పిస్తానని నమ్మించి సర్వేశ్ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




