మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
08-05-2026 10:38 AM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలకేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కేనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్యా నాయక్, సింగిల్ విండో చైర్మన్ కమలాకర్ రావు, సీడీసీ చైర్మన్ ఇర్షాద్, స్థానిక సర్పంచ్ వంకాయల శిరీష రవి, రైతులు పాల్గొన్నారు.






