7 July, 2026 | 7:58 PM

Breaking News

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •  

ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

07-07-2026 06:49 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణలతో పాటు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్ లను పరిశీలించారు. అలాగే రైతులకు విక్రయించే విత్తనాల గడువు తేదీలను తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో  చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు మరియు చందుర్తి ఎస్సై జిల్లెళ్ళ రమేష్ పాల్గొని దుకాణం రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.