ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణలతో పాటు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్ లను పరిశీలించారు. అలాగే రైతులకు విక్రయించే విత్తనాల గడువు తేదీలను తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు మరియు చందుర్తి ఎస్సై జిల్లెళ్ళ రమేష్ పాల్గొని దుకాణం రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.






