రైతులకు మేలు చేసేందుకే యాంత్రీకరణ ప్రోగ్రాం
జిల్లా అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య
మధిర,(విజయక్రాంతి): రైతులకు మేలు చేసేందుకే యాంత్రీకరణ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని జిల్లా అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య(District Agriculture Officer Pullayya) తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ యాంత్రికరణ, పనిముట్లు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం మార్కెట్ లొ డిమాండ్ ఉండే మేలైన సన్నరకం వరి విత్తనాలు సాగు చేయాలి.. తొలకరి వర్షాలు పడిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ సక్కుర్తి అనిల్ కుమార్, ఈ కార్యక్రమంలో మధిర విద్యుత్ శాఖ ఏడి,మార్కెట్ కమిటీ చైర్మన్ బండా నర్సింహారావు , మున్సిపాలిటీ కౌన్సిలర్లు వివిధ గ్రామ సర్పంచులు జిల్లా కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు






