9 April, 2026 | 5:36 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

పొంగులేటిపై చర్చకు సిద్ధం— హరీష్ ఆధారాలతో రావాలి— టీపీసీసీ చీఫ్ సవాల్

09-04-2026 03:24 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) హెచ్చరించారు. గాంధీభవన్ లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఆరోపించిన ఆయన భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పోతాయని సూచించారు.

రాష్ట్ర మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురాలని డిమాండ్ చేశారు. పునర్విభజనకు సంబంధించి ఎప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమన్నారు. దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే వ్యతిరేకిస్తున్నామని వివరించారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.