22 April, 2026 | 1:18 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

పొంగులేటిపై చర్చకు సిద్ధం— హరీష్ ఆధారాలతో రావాలి— టీపీసీసీ చీఫ్ సవాల్

09-04-2026 03:24 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) హెచ్చరించారు. గాంధీభవన్ లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఆరోపించిన ఆయన భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పోతాయని సూచించారు.

రాష్ట్ర మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు. మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురాలని డిమాండ్ చేశారు. పునర్విభజనకు సంబంధించి ఎప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమన్నారు. దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే వ్యతిరేకిస్తున్నామని వివరించారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.