మాదిగలకు 11 శాతం పదవులివ్వాల్సిందే
20-04-2026 01:54 AM
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): తెలంగాణ జనాభాలో మాదిగలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించిందని, ఆ మేరకు ప్రభుత్వ పదవులు కేటాయించా లని ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి అన్నారు. మొత్తం జనాభాలో మాదిగలు 10.3 శాతం అంటే దాదాపు 37 లక్షలు ఉన్నారని ప్రభుత్వమే చెప్పిందని ఆదివారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో అతి పెద్ద జనాభాగా ఉన్న మాదిగలకు అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, కేటాయిస్తున్న పదవులకు పొంతన లేదని, ఏ పదవుల్లోనైనా మాదిగలకు 11 శాతం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.






