12 March, 2026 | 4:18 AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

12-03-2026 01:00 AM

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): కాలనీ పరిసరాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఐదవ రోజు సందర్భంగా జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో బుధవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి నగర్ కాలనీలో ప్రత్యేక (ఈవేస్ట్) సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని కాలనీలోని పార్క్‌ను సందర్శించి పరిసర ప్రాం తాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు, కాలనీ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ కాలనీ పరిసరాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసి అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలా గే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగం గా చేపడుతున్న ఈవేస్ట్ సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమ న్నారు. ప్రజ లు కూడా ఇలాంటి కార్యక్రమాలకు సహకరించి తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ మారు తి దివాకర్, డీఈఈ (శానిటేషన్) రఘు, జీహెచ్‌ఎంసీ డీఈఈ ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఏ తిరుపతి, యూబీడీ సంతోష్, శ్రీధర్, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.