12 March, 2026 | 2:44 AM

స్వప్న స్వదేశ్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

12-03-2026 01:01 AM

బోయినపల్లి: మార్చి 11 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినపల్లి మండలం రామన్నపేట గ్రామం లో స్వప్న స్వదేశ్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉ చిత నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి బ్యాచ్ లో 20 మంది మ హిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ స్వప్నరావు తెలిపారు.ఈ కార్యక్రమం లో రామన్నపేట గ్రామ సర్పంచ్ కవిత వెంకట్ రెడ్డి, స్తంభంపల్లి సర్పంచ్ బొంగని అశోక్, వర్థవెల్లి సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా వివిధ గ్రామాల సర్పంచ్ లు మాట్లాడుతూ గ్రామీణ మహిళల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్న సంస్థ నిర్వాహకురాలు స్వప్నరావు ని అభినందిస్తూ ఈ మంచి అవకాషాన్ని మహిళ లు ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది.ఈ సంద ర్బంగా శిక్షణ తీసుకోబోతున్న మహిళల కు యూనిఫామ్, టూల్ కిట్లు ఇవ్వడం జరిగిం ది.ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి తో పాటు మాజీ ఉప సర్పంచ్ లు రాములు, భూమయ్య, సుధాకర్ రెడ్డి, అనీల్ రెడ్డి, మె రుపుల మహేష్, సతీష్, వేణు, కె మహే ష్,కిషన్, నాగార్జున్,సురేష్, శ్రీను, అనీల్ మరియు సంస్థ వాలంటీర్ లు పాల్గొనడం జరిగింది.