04-02-2026 08:32:24 PM
చిట్యాల,(విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన యువకుడి పార్థివ దేహానికి పూలమాలవేసి, మృతుడి కుటుంబాన్ని కాటం వెంకటేశం ఓదార్చారు. బుధవారం చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో సిలువేరు వెంకటేశం(35) అనారోగ్యంతో మరణించగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పెద్దకాపర్తి సర్పంచ్ కాటo వెంకటేశం వారి పార్థివ దేహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. వారి వెంట ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ మెంబర్ కురు యాదయ్య, సాకల నాగరాజు, ఏర్పు నరసింహ, ఆనగంటి నరేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.