TVK విజయ్కి కమల్ హాసన్ మద్దతు
07-05-2026 01:03 PM
- తమిళనాడు గవర్నర్ తీరుపై కమల్ నిరసన
- గవర్నర్ తీర్పు ప్రజా తీర్పును అవమానించడమే
- గవర్నర్ తీరు రాష్ట్రానికి అవమానం.. ప్రజాస్వామ్యానికి నష్టం
- మెజార్టీని రాజ్ భవన్ లో కాదు.. అసెంబ్లీలో నిరూపించుకోవాలి
చెన్నై: తమిళనాడు గవర్నర్ తీరును నిరసిస్తూ కమల్ హాసన్(Kamal Haasan) ట్వీట్ చేశారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను తమిళనాడు ప్రస్తుత గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానించట్లేదని తెలిపారు. గవర్నర్ తీర్పు ప్రజా తీర్పును అవమానించడమేనని కమల్ స్పష్టంచేశారు. గవర్నర్ తీరు రాష్ట్రానికి అవమానం.. ప్రజాస్వామ్యానికి నష్టం అన్నారు. మోజార్టీని రాజ్ భవన్ లో కాదు.. అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎస్ ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు.






