శివాజీ విగ్రహం కొరకు భూమి పూజ: సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్
26-04-2026 04:24 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టపన కొరకు సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ... నూతన పెద్ద విక్రహ కొరకు భూమి పూజ నిర్వహించమని ఈ కూడలిని శివాజీ కూడలిగా మారుస్తామన్నారు. ఈ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, శివాజీ యూత్ మండలి, గ్రామ యువకులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






