లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత
నాగిరెడ్డిపేట్, జులై 7 (విజయక్రాంతి): మండలంలోని వదల్పర్తి గ్రామంలో పూరి గుడిసెలు నివసించే నిరుపేద కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా వదలపర్తి గ్రామంలో 11 ఇండ్లు మంజూరయ్యాయని గ్రామ సర్పంచ్ సత్య బోయిన పద్మ నారాయణ తెలిపారు.లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టా పత్రాలను గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్, గ్రామ కార్యదర్శి అశోక్,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






