భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం
11-04-2026 12:04 PM
భిక్కనూర్, ఏప్రిల్ 11:(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉపసర్పంచ్ స్వామి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




