ఈ వారం వార్తల్లో..
అకటా.. ఉద్ధవ్ థాక్రే !
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) ఉద్ధవ్ థాక్రే ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ౨౦౨౨లో ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ అధికారం కోల్పోయా రు. తర్వాత తమ పార్టీ పేరు శివసేన (యూబీటీ)గా మార్చుకోవాల్సి వచ్చింది. తాజాగా పార్టీ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురెయడంతో తన తండ్రి బాలాసా హెబ్ థాక్రే వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నవ్వుల..మేలోని వెనుక?
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి జార్జియా మేలోని చరిత్ర సృష్టించారు. ఎప్పు డూ సంతోషంగా కనిపించే ఆమె నవ్వుల వెనుక తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా ఉంది. దేశంలో వలసల సమస్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. వలసలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి ఆమె ఎలా బయటపడతారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






