రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానానీ. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ సెక్రెటరీ రవీందర్ అన్నారు. గురువారం రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
బెల్లంపల్లి రైల్వే కాలనీలో రైల్వే కార్మికుల క్వార్టర్స్ ను పూర్తిస్థాయిలో మరమత్తులు చేయాలన్నారు. మంచిర్యాల పాయింట్స్ మెన్లకు ఎనిమిది గంటల పని విధానం. అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి బ్రాంచ్ లో ఉన్న అన్ని సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్,బెల్లంపల్లి బ్రాంచ్ ట్రెజరర్ షాకింగ్ మీనా, ఇతర ఆఫీస్ బేరర్స్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.




