భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం భాగీరథిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించే దిశగా ఈ కల్వర్టు నిర్మాణం కీలకమని వారు పేర్కొన్నారు. వర్షాకాలంలో రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులు ఈ పనులతో తొలగిపోతాయని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంగయ్యగారి నరసింహులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని, కల్వర్టు నిర్మాణంతో రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.






