27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం

27-07-2026 06:17 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం,మట్టపల్లి మహాక్షేత్రం నందు సోమవారం  శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు,నిత్య హోమములు జరిగాయి. అనంతరం స్వామి వారికి నిత్య కళ్యాణం  దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు వారిచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. దేవాలయం  అన్నదానంలో  110మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.