12 May, 2026 | 11:17 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఘనంగా గ్రామం పుట్టినరోజు వేడుకలు

17-01-2026 02:06 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

పాపన్నపేట, జనవరి 16 :మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామస్తులు గ్రామం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు.

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విచ్చేసి ముందుగా గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న అ నంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కోసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, లక్ష్మీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.