మొండికుంట శ్మశానవాటికకు మరమ్మతులు చేపట్టిన గ్రామపంచాయతీ
03-03-2026 12:00 AM
అశ్వాపురం, మార్చి 2 (విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న స్మశాన వాటికకు సోమవారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అవసరమైన పనులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యలను గుర్తించిన గ్రామపంచాయతీ ఇటీవల చర్యలు ప్రారంభించింది.
వారం రోజుల క్రితమే నీటి పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేయగా, ఈరోజు స్మశాన వాటికలో మట్టిని తొలగించి చుట్టుపక్కల ప్రదేశాన్ని చదును చేయించారు. ఈ పనులను సర్పంచ్ మర్రి సంధ్య, ఉపసర్పంచ్ చలమల్ల శివకుమార్, కార్యదర్శి సంధ్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.




