16 March, 2026 | 10:52 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

అంబరాన్నంటిన గ్రాడ్యుయేషన్ వేడుకలు

16-03-2026 07:05 PM

పాల్వంచ త్రివేణి పాఠశాలలో అంబరాన్నంటిన గ్రాడ్యుయేషన్ వేడుకలు

పాల్వంచ,(విజయక్రాంతి) స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలోజరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో మామిడి తోరణాలతో అందమైన రంగవల్లులతో అలంకరించారు. తరువాత పాఠశాల ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి  ఆధ్వర్యంలో పాఠశాల ప్రైమరీ ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జి.నరసింహ కుమార్ ,డాక్టర్ ఎన్విఎన్ ప్రభాస్ హాజరయ్యారు. 

వేదిక వద్ద ఏర్పాటుచేసిన దేవతా విగ్రహాలకు పూలమాలంకరణ చేసి పూజాదికాలు నిర్వహించారు. విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ను వారికి అందజేశారు. ఆపై చిన్నారులు చేసిన నృత్యం వచ్చిన అందరిని అలరింప చేసింది. తర్వాత ఒక్కొక్కరిగా వారి  ప్రసంగాలను కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ శ్రీ గొల్లపూడి వీరేంద్ర చౌదరి సీఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ  పిల్లలను ఉద్దేశించి ప్రత్యేక శుభాకాంక్షలు అందజేయగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి, కిడ్స్ ఇంచార్జ్, శ్రీమతి కవిత పాల్గొన్నారు.