మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం
కేసముద్రం, మార్చి 11 (విజయక్రాంతి): మాతా శిశు సంక్షేమానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య లక్ష్మీ కమిటీ చైర్మన్ గా డాక్టర్ అల్లం రమ, గర్భిణీలు, బాలింతలతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని, అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో, క్రమశిక్షణతో కూడిన విద్యా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజమణి, అరుణ, అనసూర్య ,ఆశ వర్కర్స్ సుజాత, నాగమణి, చంద్రకళ, శాంత, సింధు యాదవ్, ఎండి నగ్మా, జహీరా, మౌనిక, వెంకటలక్ష్మి, రోహిణి, భద్రమ్మ, ఉదయ పాల్గొన్నారు.




