17 March, 2026 | 4:55 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

17-03-2026 03:14 PM

* జిపి కార్మికుల అక్రమ అరెస్టులు అన్యాయం

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఎన్నికల ముందు జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.18,000 అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా నాయకుడు షేక్ యాకోబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో సెక్రటేరియట్ కు వెళ్లుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గొపగాని సత్యనారాయణ, నర్సిరెడ్డి, రావుల వెంకన్న, బొంత వెంకట్ రెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.