8 March, 2026 | 2:43 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

మోడల్ టీచర్ల క్యాడర్ విభజనకు సర్కారు అనుమతి

08-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. శని వారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2018 ఉత్తర్వులు ప్రకా రం కొత్త జోనల్, మల్టీ జోన్‌ల వారీగా క్యాడ ర్ విభజించేందుకు ఉపాధ్యాయలు నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 16 లోపు ఉపాధ్యాయులు జోన్ల వారీగా ఆప్ష న్లు ఇచ్చుకొని ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ ఫా మ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను మల్టీజోన్‌గా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లను జోనల్ కింద విభజించనున్నారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల క్యాడర్ విభజన పూర్తయినా కోర్టు కేసుల కారణంగా మోడల్ టీచర్ల విభజన వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల హై కోర్టు ఉత్తర్వులతో ప్ర భుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది.