10-02-2026 01:49:04 AM
కొడుకు ప్రియురాలిపై కేసు
గరిడేపల్లి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కొడుకు వివాహేతర సంబంధం కన్నతల్లి ప్రాణాల మీదకు తెచ్చింది. సూర్యాపేట జిల్లా మండల కేంద్రమైన గరిడేపల్లిలో గుం డాల మిట్ట ప్రాంతానికి చెందిన కానుగు రాంబాబు అదే ప్రాంతానికి చెందిన మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. దీని కారణంగా తలెత్తిన వివాదంలో రాంబాబు తల్లిపై సోమవారం మాధవి కత్తి తో దాడి చేసింది.
రాంబాబు, మాధవిల మధ్య వివాహేతర సంబంధం విషయంలో రాంబాబు భార్య, మాధవితో జరిగిన గొడవలో రాంబాబు భార్యను మాధవి కొట్టింది. విషయం తెలుసుకున్న రాంబాబు తల్లి బక్క మ్మ మాధవిని అడిగేందుకు వెళ్లగా అక్కడ జరిగిన వివాదంలో మాధవి కత్తితో బక్కమ్మపై దాడి చేసి, గాయపరిచింది. బక్కమ్మ ను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించినట్టు ఎస్సై చలికంటి నరేష్ వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.