27 March, 2026 | 2:26 AM

రోడ్డు వెడల్పు కోసం ఉదారత్వం

27-03-2026 12:43 AM

రామాయంపేట, మార్చి 26 : రామాయంపేట పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు సహకరిస్తూ ఎలాంటి ఒత్తి డి లేకుండా స్వయంగా తమ ఇళ్ల స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. పట్టణానికి చెందిన తోట శ్రీధర్, ఎనిశెట్టి రాజుకు చెందిన 40 గజా ల స్థలాన్ని రోడ్డు వెడల్పులో భాగంగా అప్పగించారు. అభివృద్ధికి అందరు సహకరించా లని, అవకాశం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మున్సిపల్ పాలకవర్గం తెలిపారు. కాగా శ్రీధర్, రాజును పాలకవర్గం ఘనంగా సన్మానించింది.