ఐదున్నర లక్షల సైబర్ మోసం
19-06-2026 02:04 AM
- యోనో అప్డేట్ లింక్ ఓపెన్తో మోసం
- లింకులు, ఓటీపీలు చెప్పొద్దన్న సీఐ వెంకట్రెడ్డి
సంగారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఎన్కేమూరికి చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయాడు. యోనో అప్డేట్ లింక్ ఓపెన్ చేసి ఏకంగా రూ.5.48 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించిన వెంటనే టోల్ ఫ్రీ 1930 కాల్ చేసి కంగ్టి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో ఇతర లింకులు వచ్చినా వాటిని ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పొద్దని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.






