బీఆర్ఎస్ పార్టీలో చేరిన టీపీసీసీ మాజీ సోషల్ మీడియా కన్వీనర్
08-06-2026 05:32 PM
బోథ్,(విజయకాంత్రి): సోనాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీపీసీసీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ బత్తుల రమేష్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలో గ్రూపు నివేదాల వల్ల పార్టీని పీడాల్సి వచ్చింది అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారిపై కేసులు పెట్టుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు విసిగిపోతున్నారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధీర్ రెడ్డి అభిలాష్ తోపాటు వార్డు సభ్యులు హరీష్ బోనాలు గౌడ్ లు ఉన్నారు.






