22-02-2026 07:06:56 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల పరమపదించారు.ఆదివారం మృతుడు కృష్ణారెడ్డి దశదిశ కర్మ వేడుకలు నిర్వహించడంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాజిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా ఉన్నారు.