13 July, 2026 | 5:19 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

పశువులకు గాలికుంటు టీకాలు

06-04-2026 05:13 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ గంగ ప్రసాద్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి అని, దీనిని నివారించడానికి టీకాలు వేయించడం ఒక్కటే సమర్థవంతమైన మార్గమని తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందస్తుగా టీకాలు వేయించడం చాలా తక్కువ ఖర్చుతో పాటు పశువుల ప్రాణాలను కాపాడుతుందని మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.