26 May, 2026 | 6:23 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

పశువులకు గాలికుంటు టీకాలు

06-04-2026 05:13 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ గంగ ప్రసాద్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి అని, దీనిని నివారించడానికి టీకాలు వేయించడం ఒక్కటే సమర్థవంతమైన మార్గమని తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందస్తుగా టీకాలు వేయించడం చాలా తక్కువ ఖర్చుతో పాటు పశువుల ప్రాణాలను కాపాడుతుందని మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.