6 May, 2026 | 8:57 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

పేదల పాలిట ఆపద్బాంధవుడు డాక్టర్ సంపత్ కుమార్

27-02-2026 03:02 PM

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం

తాండూరు,(విజయక్రాంతి): నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ బాలాజీ నర్సింగ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. శుక్రవారం తాండూర్ మండలం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన బుడిగజంగం లింగమ్మ అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క అంతక్రియలకు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.

మరోవైపు పాత తాండూరు 16వ వార్డు కు చెందిన నీరటి రాము అనే వ్యక్తి మృతి చెందిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పేదింటి కుటుంబ పెద్ద మృతి చెంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబాలకు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, ఆర్థిక సహాయం అందించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ భాస్కర్, అమ్రేష్ ముదిరాజ్, సంగం శీను, లాలప్ప, మొగులప్ప, వెంకట్, రమేష్,గుండు,బద్రి, అజంతా, దేవప్ప సురేష్,గణేష్  పాత తాండూర్ కు చెందిన ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.