పేదల పాలిట ఆపద్బాంధవుడు డాక్టర్ సంపత్ కుమార్
పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం
తాండూరు,(విజయక్రాంతి): నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ బాలాజీ నర్సింగ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. శుక్రవారం తాండూర్ మండలం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన బుడిగజంగం లింగమ్మ అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క అంతక్రియలకు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.
మరోవైపు పాత తాండూరు 16వ వార్డు కు చెందిన నీరటి రాము అనే వ్యక్తి మృతి చెందిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పేదింటి కుటుంబ పెద్ద మృతి చెంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబాలకు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, ఆర్థిక సహాయం అందించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ భాస్కర్, అమ్రేష్ ముదిరాజ్, సంగం శీను, లాలప్ప, మొగులప్ప, వెంకట్, రమేష్,గుండు,బద్రి, అజంతా, దేవప్ప సురేష్,గణేష్ పాత తాండూర్ కు చెందిన ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.




