13-02-2026 12:00:00 AM
మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు
ముషీరాబాద్, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యధావిధిగా మహాత్మా గాంధీ పేరు ను కొనసాగించే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఈ మేరకు గురువారం అంబర్ పేట నియోజకవర్గం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి నిరసిస్తూ మాజీ పీసిసి కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభు త్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు మాజీ పీసిసి కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వా మి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.