15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డ్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలి

30-12-2025 05:02 PM

సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎరువుల అమ్మకందారులు విధిగా ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పైడితల్లి  ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని ఫెర్టిలైజర్ డీలర్స్, సొసైటీ సీఈవోలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సుల్తానాబాద్ మండలoలో యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయని,  కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా యూరియా పంపిణీ చెయ్యాలి అన్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ అప్ లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈపీఓస్ లో ఎంటర్ చేసి యూరియా అమ్మాలని, అమ్మిన తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి, రసీదు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు,  ఫెర్టిలైజర్ డీలర్స్ , సింగిల్ విండోలా సీఈవోలు పాల్గొన్నారు.