23 March, 2026 | 3:05 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

రైతు ఉత్సవాలలో పాల్గొన్న మొద్దులగూడెం రైతులు

23-03-2026 12:19 AM

దమ్మపేట, మార్చి 22 (విజయక్రాంతి): దమ్మపేట మండలం, మొద్దులగూడెం గ్రామానికి చెందిన రైతులు రైతు ఉత్సవాలలో భాగంగా గండుగులపల్లి రైతు వేదికలో  ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు  మోరంపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులను రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పనిచేస్తున్నారని ఇందులో భాగంగానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్  లో రైతుసంక్షేమానికి 23 వేల కోట్ల రూపాయలు కేటాయించడం  హర్షించదగ్గ విషయం అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగు తోనే రైతుల జీవితాలు బాగుపడతాయని, వీలైనంతవరకు ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయటానికి ప్రయత్నం చేయాలని, వీలైనంత త్వరగా  ఆయిల్ ఫామ్ రిఫైనరీ ని అప్పారావుపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఇ ఓ వినోద్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొంతు హిమబిందు, గణపా రాము, కర్లపూడి బాలు , బొంతు రాజశేఖర్ తదితర రైతులు పాల్గొన్నారు.