కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
14-07-2026 04:12 PM
కొండపాక: కుకునూరుపల్లి మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా గూడూరి సాయిబాబ, ఉపాధ్యక్షుడిగా గడ్డం నరేష్, క్యాషియర్గా అన్నమైన బాలనర్సయ్యను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా చింతల స్వామి, ఈగ చంద్రం, పాల పర్శరాములను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ సభ్యులు యూనియన్ అభివృద్ధి, సభ్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.






