ఒక్క ఓటరు నష్టపోవద్దు
- ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ దరఖాస్తు సమర్పించాలి
- ఎంఎల్ఏ జాదవ్ అనిల్
బోథ్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం బిఎల్వోలు నిర్వహించిన ఫైళ్లను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ సుభాష్ చంద్ర, ఎంపీడీవో రమేష్ లతో మాట్లాడుతూ ఏ ఒక్క ఓటరు నష్టపోకుండా బాధ్యతగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే గుర్తించి తగు న్యాయం చేయాలన్నారు.






