15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

అనుమతులు లేకుండా విద్యా తరగతులు

09-01-2026 12:00 AM

విద్యాట్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఏఐవైఎఫ్ 

ఉప్పల్ జనవరి 8 (విజయక్రాంతి) : హబ్సిగూడా ప్రధాన రహదారిలోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ భవంతిలో ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా అక్రమంగా మొద టి, రెండవ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా పీట్(ఫిసిక్స్ వాలా) అనధికార కళాశాలపై చర్యలు తీసుకోవాలని, కళాశాల అను మతులు ఒక దగ్గర,అడ్మిషన్లు ఒక దగ్గర.... తరగతులు ఒక చోట నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు.

కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం హబ్సిగూడాలోని అనధికార విద్యా పీట్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, సతీష్, ప్రవీణ్, శేఖర్ పాల్గొన్నారు.