11 April, 2026 | 4:51 PM

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

11-04-2026 03:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన కుట్టు మిషన్లను ఆ పార్టీ నాయకులు శనివారం పంపిణీ చేశారు. దిల్వార్పూర్ మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన నవనీత నరేష్, భార్గవి లక్ష్మణ్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కామ రాజేశ్వర్ రెడ్డి, నరేష్ రెడ్డి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.