15 June, 2026 | 7:16 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ఎన్నికల కోసమే మహిళలకు చీరల పంపిణీ

24-11-2025 12:21 PM

మాజీ జడ్పీటీసీ కవిత

బెజ్జంకి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు చీరలను పంపింని చేస్తుందని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బిఆర్ ఎస్ మాజీ జడ్పీటీసీ కనగండ్ల కవిత  విమర్శించారు. సోమవారం విజయక్రాంతి మండల ప్రతినిధి తో  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహి ళలకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ పండుగకు చీర లు అందిస్తామని చెప్పి బతుకమ్మ పండుగకు అందియ్య లేదని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ఉన్నాయని, మహిళలకు ఇందిరమ్మ చీరలంటూ పంపి స్తున్నారని విమర్శించారు. మహిళల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతలేని చీరలను అందిస్తుందని

ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరే కత ఉన్నది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసినా ఎన్ని డ్రామాలాడిన స్థానిక సంస్థ ఎన్నికలలో ఎన్నికలలో బిఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.