13 July, 2026 | 5:23 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం

13-07-2026 04:19 PM
  1. పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం 
  2. గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 
  3. విద్యార్థులకు మందుల పంపిణీ

గణపురం,జూలై 13 విజయక్రాంతి: రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యమని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గణపురం మండల కేంద్రంలో సోమవారం గణపురం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య రక్షణలో భాగంగా నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఈ మందులు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కాయిత జలంధర్ పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.