11 May, 2026 | 8:17 PM

Breaking News

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •   ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం   •   మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి   •   ప్రజావాణికి భూకబ్జాల భాగోతం   •   ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య   •   అర్హులైన పేదలందరికీ... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించండి   •   భాగ్యనగర్ తండా ఉపాధి హామీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం   •   ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి   •  

పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

17-02-2026 05:40 PM

అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.

ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సుల్తానాబాద్ కు చెందిన శ్రీ అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు బొడ్ల శ్రీనివాస్, నాగమల్ల ప్రశాంత్, పల్లా శరత్, పల్లా అనిల్, అల్లంకి అరుణ్, చకిలం  వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, సామాజిక సేవకులు పల్లకిషన్, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లా శ్రీనివాస్ (వాసు), కొమురవెల్లి శ్రీకాంత్ తో పాటు కరీంనగర్, చొప్పదండి ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక  ప్రముఖులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.