17-02-2026 05:31:08 PM
అచ్చంపేట: నల్లమలలోని అభయారన్యం శివారులో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ సెక్షన్ అధికారి బాలకృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్ పల్లికి చెందిన హట్టి కి చెందిన ఆవు మేత కోసం అటవీ శివారులోకి వెళ్ళింది. దీంతో ఆవును పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఘటనపై వివరాలు సేకరించామని సెక్షన్ అధికారి తెలిపారు. అటవీ నిబంధన మేరకు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పారు.