13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

చదువు ఒక్కటే మన తలరాతను మార్చుతుంది

23-12-2025 06:11 PM

ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): ఎవరి జీవితంలోనైనా విద్యబ్యాసం ఒక్కటే వారి తలరాతను మార్చుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న అపెక్స్ సెంట్రల్ స్కూల్, రాజేంద్రనగర్‌లోని న్యూ రిషి హై స్కూల్, భగీరథ కాలనీలో గల మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్లలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను పదవతరగతి చదువుతున్న విద్యార్థులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. డిజిటల్ కంటెంట్ ద్వారా విద్య మరింత సులభంగా, సమగ్రంగా అర్థమవుతుందని, ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఐఐఐటి కళాశాలలో ఎక్కువ శాతం మన ఉమ్మడి మహబూబ్‌నగర్ విద్యార్థులే అడ్మిషన్ పొందాలన్నదే తన లక్ష్యం అని ఎమ్మెల్యే చెప్పారు.