calender_icon.png 12 February, 2026 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు డీఈ, ఏఈఓల పర్యవేక్షణ

12-02-2026 06:28:46 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గురువారం డీఈ, ఏఈఓలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ నాణ్యతతో పాటు లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం కల్పిస్తున్న గృహ సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.