15 June, 2026 | 2:19 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి

06-04-2026 09:02 PM

- కిసాన్ సంఘ్ నేతలు

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మొక్క జొన్న, జొన్న, వరి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతుల నుండి తక్షణమే పంటలను కొనుగోలు చేయాలని కిసాన్ సంఘ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నేతలు నాయబ్ తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందచేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక  వసతులు కల్పించాలని, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టర్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ తొలగించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని, అంతే కాకుండా ఎలాంటి పరిమితులు లేకుండా రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి అందేలా చూడాలని వారు అధికారులకు విన్నవించారు.