15 June, 2026 | 2:58 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం

15-06-2026 01:41 PM

బోథ్, జూన్ 15(విజయక్రాంతి): పాఠశాలను ప్రారంభమైన మొదటి రోజున అన్ని గ్రామాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా స్వాగతించారు. పాఠశాలలో ని ద్వారాల వద్ద బెలూన్స్ తో పాటు వివిధ రకాల జెండాలను ఏర్పాటు చేసి బ్యాండ్ మేళాలతో సుస్వాగతం జరిగింది. మండలంలోని కౌట (బి )గ్రామంలో. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరవ తరగతిలో చేరిన విద్యార్థులను ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల సెంటిమెంట్ విద్యార్థుల గైరాజర్

పాఠశాల ప్రారంభం రోజున అమావాస్య రావడంతో పెద్ద మొత్తంలో విద్యార్థులను పాఠశాలకు తల్లిదండ్రులకు పంపించలేకపోయారు. పాఠశాల మొదటి రోజున అమావాస్య అడ్డు వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా మంగళవారం రోజున సైతం సెంటిమెంటు ప్రకారం ఆడపిల్లలను బయటకు పంపించరు. దీంతో మంగళవారం సహితం ఆడపిల్లలు పాఠశాలకు గైరాజర్ అయ్యే అవకాశాలున్నాయి.